Saturday, April 27, 2024

ఎంఎల్‌సి కవిత సోషల్ మీడియా ఖాతాలు హ్యాక్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : తన సోషల్ మీడియా ఖాతాలు హ్యాకింగ్‌కు గురైనట్టు బిఆర్‌ఎస్ ఎంఎల్‌సి కల్వకుంట్ల కవిత ప్రకటించారు. ఎక్స్ సహా ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్లు హ్యాక్ చేశారని సోషల్ మీడియాలో కవిత పోస్ట్ చేశారు. సైబర్ నేరగాళ్లు మంగళవారం నాడు రాత్రి 10 గంటల నుంచి బుధవారం ఉదయం 11 గంటల వరకు వరుసగా పలు సార్లు హ్యాకింగ్‌కు యత్నించారు. అనుమానాస్పదంగా లాగిన్ అయ్యి దుండగులు ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో సంబంధం లేని ఒక వీడియోను పోస్టు చేశారు. వెంటనే గుర్తించిన కవిత తన సోషల్ మీడియా ఖాతాలు హ్యాకింగ్‌కు గురైనట్లు ఎక్స్ ద్వారా వెల్లడిస్తూ డిజిపికి, సైబర్ సెక్యూరిటీ విభాగానికి ట్యాగ్ చేశారు. సోషల్ మీడియా ఖాతాలను పూర్తి స్థాయిలో తిరిగి పునరుద్ధరించే ప్రయత్నాలు జరుగుతున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News