Wednesday, May 1, 2024

‘లూసిఫర్’ రీమేక్ కు దర్శకుడు ఫిక్స్

- Advertisement -
- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి 153వ సినిమాను తెరకెక్కించే దర్శకుడిని ఖరారు చేశారు. సూపర్‌స్టార్ మోహన్ లాల్ నటించిన మలయాళ ‘లూసిఫర్’ను చిరంజీవి తెలుగులోకి రీమేక్ చేయబోతున్నారు. రామ్‌చరణ్ నటించిన ‘ధృవ’ మాతృక ‘తనీ ఒరువన్’ను రూపొందించిన దర్శకుడు మోహన్ రాజా ఈ సినిమాను తెరకెక్కిస్తారు. ఈ మూవీ స్క్రిప్ట్, దర్శకుడిని ఫైనల్ చేశారు చిరంజీవి. వచ్చే సంక్రాంతి తర్వాత ఈ సినిమా పట్టాలెక్కుతుంది. ఈ సినిమా గురించి చిరంజీవి మాట్లాడుతూ “లూసిఫర్ రీమేక్ స్క్రిప్ట్ ఫైనల్ అయింది. ‘తనిఒరువన్’ ఫేం మోహన్ రాజా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తారు. రీమేక్ కథ ఓకే అయింది. మన నేటివిటీకి తగ్గట్టుగా ఈ ప్రతిష్టాత్మక స్క్రిప్ట్‌ను మోహన్ రాజా చాలా బాగా తీర్చిదిద్దారు.

సంక్రాంతి తర్వాత సెట్స్‌కు వెళ్తాం. ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్‌లో జరిగే షూటింగ్‌తో ఈ సినిమా పూర్తవుతుంది. ఎన్.వి.ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు” అని అన్నారు. “నా తల్లిదండ్రులు, సన్నిహితుల ఆశీర్వాదాల కారణంగా నాకు జీవితం చాలా పెద్ద బహుమతులు అందిస్తోంది. ఈ సారి నేను మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఓ మెగా ప్రాజెక్టు చేయబోతున్నాను. ఈ అవకాశం రావడాన్ని గౌరవంగా భావిస్తున్నాను. మీ అందరి ఆశీస్సులు కావాలి”అని మోహన్ రాజా ఈ సందర్భంగా ట్వీట్ చేశారు. ప్రస్తుతం డైరెక్టర్ కొరటాల శివ రూపొందిస్తున్న ‘ఆచార్య’లో చిరంజీవి నటిస్తున్నారు. ఆతర్వాత ‘లూసిఫర్’ రీమేక్‌ను పట్టాలెక్కిస్తారు.

Mohan Raja to direct Lucifer Telugu Remake

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News