మెగాస్టార్ చిరంజీవి 153వ సినిమాను తెరకెక్కించే దర్శకుడిని ఖరారు చేశారు. సూపర్స్టార్ మోహన్ లాల్ నటించిన మలయాళ ‘లూసిఫర్’ను చిరంజీవి తెలుగులోకి రీమేక్ చేయబోతున్నారు. రామ్చరణ్ నటించిన ‘ధృవ’ మాతృక ‘తనీ ఒరువన్’ను రూపొందించిన దర్శకుడు మోహన్ రాజా ఈ సినిమాను తెరకెక్కిస్తారు. ఈ మూవీ స్క్రిప్ట్, దర్శకుడిని ఫైనల్ చేశారు చిరంజీవి. వచ్చే సంక్రాంతి తర్వాత ఈ సినిమా పట్టాలెక్కుతుంది. ఈ సినిమా గురించి చిరంజీవి మాట్లాడుతూ “లూసిఫర్ రీమేక్ స్క్రిప్ట్ ఫైనల్ అయింది. ‘తనిఒరువన్’ ఫేం మోహన్ రాజా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తారు. రీమేక్ కథ ఓకే అయింది. మన నేటివిటీకి తగ్గట్టుగా ఈ ప్రతిష్టాత్మక స్క్రిప్ట్ను మోహన్ రాజా చాలా బాగా తీర్చిదిద్దారు.
సంక్రాంతి తర్వాత సెట్స్కు వెళ్తాం. ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్లో జరిగే షూటింగ్తో ఈ సినిమా పూర్తవుతుంది. ఎన్.వి.ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు” అని అన్నారు. “నా తల్లిదండ్రులు, సన్నిహితుల ఆశీర్వాదాల కారణంగా నాకు జీవితం చాలా పెద్ద బహుమతులు అందిస్తోంది. ఈ సారి నేను మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఓ మెగా ప్రాజెక్టు చేయబోతున్నాను. ఈ అవకాశం రావడాన్ని గౌరవంగా భావిస్తున్నాను. మీ అందరి ఆశీస్సులు కావాలి”అని మోహన్ రాజా ఈ సందర్భంగా ట్వీట్ చేశారు. ప్రస్తుతం డైరెక్టర్ కొరటాల శివ రూపొందిస్తున్న ‘ఆచార్య’లో చిరంజీవి నటిస్తున్నారు. ఆతర్వాత ‘లూసిఫర్’ రీమేక్ను పట్టాలెక్కిస్తారు.
With the blessings of my parents and well wishers, life has always gifted me better and bigger things.
And this time I’m more elated n honored to direct a mega project with the Megastar @KChiruTweets himself 🙏😇
Need all your wishes n prayers 🙏 #Chiru153 pic.twitter.com/d2uhQIGOpy— Mohan Raja (@jayam_mohanraja) December 16, 2020
Mohan Raja to direct Lucifer Telugu Remake