- Advertisement -
మున్నేరు: ఇద్దరు పిల్లలతో పాటు తల్లి ఆత్మహత్య చేసుకున్న విషాద సంఘటన ఖమ్మం జిల్లాలో చోటుచేసుకుంది. ఖమ్మంలోని మున్నేరు వాగులో దూకి తల్లి బలవన్మరణానికి పాల్పడింది. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మున్నేరులో నుంచి మృతదేహాలను వెలికితీశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. కుటుంబ కలహాల కారణంగానే వీరు ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సిఉంది.
Mother commits suicide along with two children in khammam
- Advertisement -