Thursday, May 9, 2024

ఆ తప్పు చేసినట్టు నిరూపిస్తే దేనికైనా సిద్ధమే: రఘు రామకృష్ణరాజు

- Advertisement -
- Advertisement -

అమరావతి: తాను తప్పు చేసినట్టు నిరూపిస్తే దేనికైనా సిద్ధమేనని, సంధ్య ఆక్వా కంపెనీ పేరిట బుక్ అయిన కంటైనర్‌లో డ్రగ్స్ దొరికాయని ఎంపి రఘురామకృష్ణరాజు తెలిపారు. విశాఖపట్నం డ్రగ్స్ ఘటనపై ఎంపి రఘురామకృష్ణరాజు స్పందించారు. డా కెవి ప్రసాద్, కూనం వీరభద్రరావు కలిసి సంస్థను స్థాపించారు. సంధ్య మెరైన్, సంధ్య ఆక్వా కంపెనీలు విజయవంతంగా నడిపిస్తున్నారని వెల్లడించారు. కొన్నేళ్ల క్రితం డా కెవి ప్రసాద్, కూనం వీరభద్రరావు విడిపోయారని, సంధ్య కంపెనీ పర్యావరణ నిబంధనలు పాటించడంలేదని ఇబ్బంది పెట్టారని, ఇప్పుడు కంపెనీ పర్యావరణ నిబంధనలు పాటించడంలేదని సాక్షిలో కథనం వచ్చిందని కృష్ణరాజు పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News