Saturday, May 4, 2024

ఓ మంచి పాయింట్‌తో…

- Advertisement -
- Advertisement -

శ్రీనివాస్ రెడ్డి, దీక్షిత్ శెట్టి, వెన్నెల రామారావు ప్రధాన పాత్రలలో తెరకెక్కిన చిత్రం ‘ముగ్గురు మొనగాళ్లు’. చిత్ర మందిర్ బ్యానర్‌పై అభిలాష్ రెడ్డి దర్శకత్వంలో పి.అచ్యుత రామారావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు వీడియో ద్వారా మాట్లాడుతూ “ముగ్గురు మొనగాళ్లు టైటిల్‌తో చిత్రాన్ని ఒకప్పుడు చిరంజీవితో నేను చేశాను. ఇప్పుడు అదే టైటిల్‌తో నటుడు రామారావు డిఫరెంట్ కథతో ఈ సినిమా చేశారు. ఈ చిత్రం టీజర్, ట్రైలర్ బావున్నాయి. ఈ సినిమా విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నాను”అని అన్నారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వీడియో ద్వారా మాట్లాడుతూ “తొలిసారి చెవులు వినపడని, మాటలు మాట్లాడలేని, కళ్లు కనపడని పాత్రలతో సినిమా చేయడం కొత్త విషయం. ఓ మంచి పాయింట్‌తో ఈ సినిమా చేసినందుకు అభినందిస్తున్నాను”అని తెలిపారు. నిర్మాత, నటుడు అచ్యుత రామారావు మాట్లాడుతూ “అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే చిత్రమిది. తప్పకుండా ఈ చిత్రం విజయం సాధిస్తుందన్న నమ్మకం ఉంది”అని చెప్పారు. ఈ కార్యక్రమంలో బిగ్‌బాస్ ఫేమ్ సొహైల్, అరియానా, రైటప్ బివిఎస్ రవి, సినిమాటోగ్రాఫర్ గరుడవేగ అంజి, డైరెక్టర్ అభిలాష్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, దీక్షిత్ శెట్టి పాల్గొన్నారు.

Mugguru Monagallu movie pre release event

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News