Monday, April 29, 2024

ముంబైకి మరో విజయం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: ప్రొ పంజా లీగ్ (ఆర్మ్ రెజ్లింగ్) పోటీల్లో ముంబై మసల్స్ మరో విజయం నమోదు చేసింది. ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో ఈ పోటీలు జరుగుతున్నాయి. ఇందులో దేశ వ్యాప్తంగా ఆరు నగరాలకు చెందిన జట్లు తలపడుతున్నాయి. మంగళవారం రోథక్ రౌడీస్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై జయకేతనం ఎగుర వేసింది. ఆరంభం నుంచే ముంబై ఆటగాళ్లు ఆధిపత్యం చెలాయించారు. ప్రత్యర్థి జట్టును హడలెత్తిస్తూ వరుస విజయాలను సొంతం చేసుకున్నారు. కాగా ఈ విజయంతో ముంబై 107 పాయింట్లతో అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. రోథక్ రెండో, బరోడా మూడో స్థానంలో కొనసాగుతున్నాయి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News