Saturday, April 27, 2024

హరీశ్ రావును మాత్రమే విమర్శించా.. పార్టీని కాదు: మైనంపల్లి

- Advertisement -
- Advertisement -

మంత్రి హరీశ్ రావుపై వ్యక్తిగతంగా మాత్రమే వ్యాఖ్యలు చేసినట్లు బీఆర్ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు పేర్కొన్నారు. ప్రస్తుతం తిరుమలలో ఉన్న మైనంపల్లి హనుమంతరావు మరోసారి బిఆర్ఎస్ టికెట్ల కేటాయింపుపై స్పందించారు. నిన్న తాను పార్టీ గురించి మాట్లాడలేదని, తన వ్యక్తిగత అభిప్రాయాలను మాత్రమే వెల్లడించాని మైనంపల్లి అన్నారు. హరిశ్ రావును మాత్రమే విమర్శించానని.. పార్టీని కాదన్నారు.

తన కుమారుడితోపాటు మెదక్, మల్కాజ్ గిరి కార్యకర్తలే తనకు ప్రధాన్యమని చెప్పారు. తన జీవితంలో ఎవరినీ ఇబ్బంది పెట్టలేదని… తనను ఇబ్బంది పెడితే కచ్చితంగా ఇబ్బంది పెడతానని అన్నారు. తాను ఏ పార్టీని విమర్శించనని, పార్టీలకు అతీతంగా ఉంటానన్నారు. హైదరాబాద్ కు వెళ్లాక క్యాడర్‌తో మాట్లాడి తన కార్యాచరణ వెల్లడిస్తానని తెలిపారు. తన కొడుకుకు టికెట్ ఇస్తే గెలిపించుకొని వస్తానని మైనంపల్లి పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News