Saturday, April 27, 2024

మంత్రి కెటిఆర్‌ను కలిసిన మైనంపల్లి

- Advertisement -
- Advertisement -

Mynampally Hanumantha Rao meets Minister KTR

మల్కాజిగిరి: రాష్ట్ర ఐటి, మున్సిపల్ శాఖమంత్రి కెటిఆర్ సంపూర్ణ సహకారంతో మల్కాజిగిరి నియోజకవర్గం ఎంతో అభివృద్ధి చెందుతుందని స్థానిక శాసనసభ్యులు మైనంపల్లి హన్మంతరావు పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం ఆయన మంత్రి కెటిఆర్‌ను కలిసి మల్కాజిగిరిలోని పలు ప్రధాన సమస్యలను వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే హన్మంతరావు మాట్లాడుతూ.. ప్రధానంగా బండచెరువు దిగువ ప్రాంతాలలో చేపడుతున్న నాలా నిర్మాణానికి గతంలోనే రూ 9 కోట్లు నిధులు మంజూరయ్యాయని, టెండర్ల ప్రక్రియ కూడా పూర్తయిందని, ఈ పనులను వెంటనే జిహెచ్‌ఎంసి ఇంజనీరింగ్ శాఖకు బదిలీ చేయాలని కోరారు. అదే విధంగా మౌలాలి హనుమాన్‌నగర్ జెడ్‌టీఎస్ గ్రౌండ్ వద్ద రైల్వే ప్రహరీ గోడ నిర్మాణంతో రహదారి సమస్య ఉత్పన్నమవుతుందని, దీనికి రైల్వే అధికారులకు భూమి పరిహారం ఇవ్వాలని మంత్రిని కోరినట్లు చెప్పారు. దీనికి మంత్రి కెటిఆర్ సానుకూలంగా స్పందించారని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News