Tuesday, April 30, 2024

ప్రభాస్ మూవీ కోసం లెజెండరీ డైరెక్టర్..

- Advertisement -
- Advertisement -

నేషనల్ స్టార్ ప్రభాస్ తన తర్వాత చిత్రాన్ని నాగ్‌అశ్విన్ డైరెక్షన్‌లో చేయనున్న సంగతి తెలిసిందే. అంతర్జాతీయ స్థాయిలో నిర్మించబడుతున్న ఈ సినిమాకి లెజెండరీ డైరెక్టర్ పని చేయనున్నారు. తెలుగు ఇండస్ట్రీలో అప్పట్లో వైవిధ్యానికి కేరాఫ్ ఆఫ్ అడ్రస్‌గా నిలిచిన డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు ఈ సినిమాకి క్రియేటివ్ హెడ్‌గా పని చేస్తున్నారు. ఈ విషయాన్ని వైజయంతీ మూవీస్ అధికారికంగా తెలుపుతూ “మేము ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న కల చివరకు నెరవేరనుంది. సింగీతం శ్రీనివాస రావును మా ఎపిక్ చిత్రానికి స్వాగతిస్తున్నందుకుగానూ మేము ఎంతో సంతోషిస్తున్నాము. ఆయన సృజనాత్మక సూపర్ పవర్స్ ఖచ్చితంగా మాకు మార్గదర్శకంగా ఉంటాయి” అని పోస్ట్ చేశారు. ఇక ఇప్పటి జనరేషన్ కూడా సింగీతం శ్రీనివాసరావు తీసిన అప్పటి సినిమాలను బాగా ఇష్టపడతారు. ముఖ్యంగా పుష్పక విమానం, ఆదిత్య 369, అపూర్వ సోదరులు లాంటి భిన్నమైన ప్రయోగాత్మక చిత్రాలు ఇప్పటికీ గొప్ప వైవిధ్యమైన చిత్రాలుగా నిలుస్తున్నాయి. కాగా నాగ్‌అశ్విన్ ఓ పురాణ కథలోని పాత్రల ఆధారంగా నేటి సమాజానికి తగ్గట్లు కథ రాసుకున్నాడని, ముఖ్యంగా ప్రభాస్ రెండు పాత్రల్లో కనిపిస్తాడని తెలిసింది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత సి.అశ్వనీదత్ నిర్మిస్తున్నారు.

Nag Ashwin work with Singeetam Srinivasa Rao

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News