కార్వాన్: పెళ్లి అయి 20 రోజులు కూడా కాకముందే ఓ తాగుబోతు భర్త వేధింపులు తాళలేక అతడిని హత్య చేసిన సంఘటన టప్పాచబుత్ర పోలీస్స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం… ముజాహిద్నగర్కు చెందిన అస్లం (25)కు, జిర్రా ప్రాంతానికి చెందిన సమ్రీన్ (22)తో గత నెల 19న వివాహం జరిగింది. అస్లంకు విపరీతంగా మద్యం సేవించే అలవాటు ఉంది. ఈ నేపథ్యంలో పెళ్లి అయిన నాటి నుంచి సమ్రీన్ను వేధిస్తున్నాడు. ఈ క్రమంలో గురువారం రాత్రి కూడా ఇద్దరికి గొడవ జరిగింది. నిత్యం వేధిస్తున్న తాగుబోతు భర్తను అంతమొందించాలని నిశ్చయానికి వచ్చిన సమ్రీన్ శుక్రవారం ఉదయం నిద్రిస్తున్న భర్త అస్లం తలపై రోకలిబండతో బాదింది. దీంతో తీవ్రంగా గాయపడిన అస్లంను కుటుంబ సభ్యులు ఉస్మానియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తుండగానే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
New Bride Killed Husband At Hyderabad