వారణాసి: అప్పుడే పుట్టిన శిశువుకు కరోనా పాజిటివ్ వచ్చి, తల్లికి నెగెటివ్ వచ్చిన సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రం వారణాసిలోని బనారస్ హిందూ విశ్వవిద్యాలయంలోని(బిహెచ్యు) ఎస్.ఎస్ ఆసుపత్రిలో చోటుచేసుకుంది. మే 24న పురిటి నొప్పులతో ఆస్పత్రిలో చేరిన సుప్రియ (26)కు కరోనా పరీక్షలు చేశారు. అందులో నెగెటివ్ వచ్చింది. ఆమెకు డెలివరీ చేసిన వైద్యులు మరుసటి రోజు ఆమెకు పుట్టిన పాపకు టెస్ట్ చేయగా కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో వైద్యులతోపాటు సుప్రియ కుటుంబసభ్యులు షాక్ తిన్నారు. అయితే, బిడ్డ పాజిటివ్ పరీక్షించినట్లు బీహెచ్యూ రిజిస్ట్రార్ నీరజ్ త్రిపాఠి ధృవీకరించారు. తల్లి, బిడ్డ ఇద్దరూ లేబర్ రూమ్లో ఉన్నారని ఆయన బుధవారం సాయంత్రం చెప్పారు. త్రిపాఠి తాను ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్తో మాట్లాడానని, ప్రస్తుతం ఆ మహిళ ఆమె బిడ్డ “ఇద్దరూ బాగానే” ఉన్నారని పేర్కొన్నారు.
Newborn baby tests Covid-19 positive in Varanasi