- Advertisement -
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్ గా తనను తిరిగి నియమించాలని ఎపి ప్రభుత్వం అమలు చేయడం లేదంటూ నిమ్మగడ్డ రమేష్ కుమార్ బుధవారం హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు తీర్పును అమలు చేయకుండా వైసిపి ప్రభుత్వం కోర్టు ధిక్కరణకు పాల్పడుతోందని నిమ్మగడ్డ పిటిషన్ లో పేర్కొన్నారు. నిమ్మగడ్డ పిటిషన్ హైకోర్టు విచారణకు స్వీకరించింది. ఎపి సిఎస్, పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి, ఎపి ఎన్నికల కార్యదర్శులను నిమ్మగడ్డ ప్రతివాదులుగా చేర్చారు.
Nimmagadda filed a contempt of court case against Govt
- Advertisement -