లక్నో: స్కార్పియో, ట్రక్కు ఢీకొని జరిగిన ఘోర రోడ్డుప్రమాదంలో తొమ్మిదిమంది మృతి చెందిన విషాద ఘటన ఉత్తర్ప్రదేశ్ ప్రతాప్గఢ్ లో శుక్రవారం ఉదయం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 9మంది అక్కడిక్కడే మృతి చెందగా… ట్రక్ డైవర్ తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని చికిత్స నిమిత్తం సమీపఆస్పత్రికి తరలించారు. మృతుల్లో నలుగురు పురుషులు, ముగ్గురు మహిళలు, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
రాజస్థాన్ నుంచి బీహార్ వెళ్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. కారు నుజ్జు నుజ్జు కావడంతో మృతదేహాలను బయటకు తీసుకురావడానికి గ్యాస్ కట్టర్లను ఉపయోగించాల్సి వచ్చిందని పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంపై యుపి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆవేదన వ్యక్తం చేశారు. గాయపడినవారికి సరైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు.
Nine Died in Road Accident at Pratapgarh Of UP