Friday, April 26, 2024

స్కార్పియో- ట్రక్కు ఢీ : తొమ్మిది మంది మృతి

- Advertisement -
- Advertisement -

Nine Died in Road Accident at Pratapgarh Of UP

లక్నో: స్కార్పియో, ట్రక్కు ఢీకొని జరిగిన ఘోర రోడ్డుప్రమాదంలో తొమ్మిదిమంది మృతి చెందిన విషాద ఘటన ఉత్తర్‌ప్రదేశ్ ప్రతాప్‌గఢ్ లో శుక్రవారం ఉదయం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 9మంది అక్కడిక్కడే మృతి చెందగా… ట్రక్ డైవర్ తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని చికిత్స నిమిత్తం సమీపఆస్పత్రికి తరలించారు. మృతుల్లో నలుగురు పురుషులు, ముగ్గురు మహిళలు, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

రాజస్థాన్ నుంచి బీహార్ వెళ్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. కారు నుజ్జు నుజ్జు కావడంతో మృతదేహాలను బయటకు తీసుకురావడానికి గ్యాస్ కట్టర్లను ఉపయోగించాల్సి వచ్చిందని పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంపై యుపి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆవేదన వ్యక్తం చేశారు. గాయపడినవారికి సరైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు.

Nine Died in Road Accident at Pratapgarh Of UP

Nine Died in Road Accident at Pratapgarh Of UP

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News