Saturday, April 27, 2024

ప్రభుత్వ ఉద్యోగుల సంఘంపై ఎపి సర్కార్ గుస్సా

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : అమరావతిలో ఎపి ప్రభుత్వ ఉద్యోగుల సంఘం (ఎపిజీఈఏ) ఇటీవల గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌ను కలవడంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వివరణ కోరింది. ఈ మేరకు ఈ సంఘానికి సోమవారం నాడు నోటీసులు జారీ చేసింది. మీడియా , పత్రికల్లో వచ్చిన వార్తల ఆధారంగా నోటీసులు ఇస్తున్నట్లు పేర్కొంది. వేతనాలు, ఆర్థిక అంశాలపై ప్రభుత్వాన్ని సంప్రదించే ప్రత్యామ్నాయ మార్గాలు ఉండగా ఎందుకు కలిశారని ఆ సంఘాన్ని ప్రభుత్వం ప్రశ్నించింది.

గవర్నర్‌ను కలిసి ఫిర్యాదు చేయడం రోసా నిబంధనలకు విరుద్ధమని సంఘం గుర్తింపును ఎందుకు రద్దు చేయకూడదో వారంలోపు చెప్పాలని ఆదేశించింది. ప్రభుత్వ ఉద్యోగులకు సమయానికి జీతభత్యాలు అందేలా చట్టం చేయాలని కోరుతూ ఏపి ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ ఆధ్వర్యంలో నేతలు ఇటీవల అమరావతిలో గవర్నర్‌ను కలిశారు.

ఉద్యోగులకు చెల్లించాల్సిన ఆర్ధిక ప్రయోజనాల విషయంలో ప్రభుత్వం ఉల్లంఘనలకు పాల్పడుతోందని ఆయనకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో దీనిపై వివరణ కోరుతూ ఏపి సర్కారు ఆ సంఘానికి నోటీసులు జారీ చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News