Wednesday, May 1, 2024

పాక్ నౌకలో అణు యంత్రాలు

- Advertisement -
- Advertisement -

చైనా నుంచి కరాచీ వెళ్తున్న నౌక

ముంబై పోర్టులో నిలిచి వేసిన భారత భద్రత బలగాలు

ముంబై : చైనా నుంచి పాకిస్థాన్‌కు తరలివెళ్లుతున్న ఓ అనుమానాస్పద నౌకను భారత భద్రతా సంస్థలు ఇటీవల ఇక్కడి నహ్వ షేవా పోర్టులో నిలిపివేసి, తమ అదుపులోకి తీసుకున్నారు. చైనా నుంచి పాకిస్థాన్‌లోని కరాచీకి వెళ్లుతున్న ఈ నౌకలోని సరుకులపై అనుమానం రావడంతో తనిఖీలు చేపట్టగా ఇందులో రెండురకాల వాడకానికి పనికి వచ్చే సరుకుంది. దీనితో పాకిస్థాన్ తన దేశ అణు, బాలిస్టిక్ మిస్సైల్స్ కార్యక్రమాలను నిర్వహించుకునే వీలుందని వెల్లడైంది. తమకు అందిన కీలక రహస్య సమాచారం మే రకు , ఇంటలిజెన్స్ వర్గాల సూచనలతో కస్టమ్స్ అధికారులు ముంబై వద్ద మాల్టా దేశపు జెండాతో ఉన్న వాణిజ్య నౌక సిఎంఎ సిజిఎం అట్టిలాను నిలిపి పరిశీలన జరిపారు.

కరాచీ బాటపట్టిన ఈ నౌకలో కం ప్యూటర్ న్యూమరికల్ కంట్రోలు (సిఎన్‌సి) మిషిన్ ఉంది. దీనిని ఇటలీకి చెందిన ఓ సంస్థ తయారుచేసింది. ఈ కీలకమైన మెషిన్‌ను ఓ కంప్యూటర్ ద్వా రా నిర్వహిస్తూ ఉంటారు. కాగా ఇక్కడ దొరికిన సరుకును రక్షణ శాఖకు చెందిన పరిశోధనా సంస్థ డిఆర్‌డిఒ నిశితంగా పరీక్షించింది. ఈ క్రమంలో ఈ సరుకును పొరుగుదేశం పాకిస్థాన్‌లో అణు కార్యక్రమాల నిర్వహణకు వాడుకునే వీలుందని, ఇందుకే తీసుకువెళ్లుతున్నారని నిర్థారించారు. కాగా చైనా నుంచి ఈ సరుకు బయలుదేరడం వల్ల చైనా పాక్‌ల నడుమ భా రీ స్థాయిలోనే అణు కార్యక్రమాల వ్యవహారం లోపాయికారిగా సాగుతున్న వైనం మరోసారి స్పష్టం అ యింది. పాకిస్థాన్ తన క్షిపణి అభివృద్ధి కార్యక్రమాలకు , వీటికి అణుపాటవ శక్తిని సంతరింపచేసేందు కు ఈ సరుకును కీలక దశలలో వాడుకునేందుకు వీలుందని నిర్థారించారు. అణు ఆయుధాలు, క్షిపణుల తయారీ దశలలో ఈ సరుకును కీలక విభాగాలలో తీరిగ్గా వాడుకునేందుకు తరలిస్తున్నారని నిపుణులు నిర్థారించారు. సిఎన్‌సి మిషిన్ అత్యంత కీలకంగా అణు కార్యక్రమాలలో వాడకానికి పనికి వ స్తుంది. ఉత్తరకొరియా దీనిని యధేచ్చగా వాడుకొంటోంది. అయితే సిఎన్‌సి మిషన్ డేంజర్ మిషిన్ అ యినందున, ఇది ప్రపంచ స్థాయి భద్రతా సమతూకతను దెబ్బతీస్తున్నందున 1996 నుంచి దీనిని సంప్రదింపుల క్రమంలో వాసెనార్ అగ్రిమెంట్‌లో చేర్చా రు. అంతర్జాతీయ ఆయుధాల నియంత్రణ వ్యవస్థ క్రమంలో ఈ ఒప్పందం కుదిరింది. కొన్ని దేశాలు రహస్యంగా అణ్వాయుధ కార్యక్రమాలను చేపడుతున్నందున, ఇందుకు ఈ మిషన్ కీలకం అయినందున దీనిని పౌరులు లేదా సైనిక వాడకానికి నిషేధించారు. ఈ ఒప్పందంపై సంతకాలు చేసిన 42 దేశాలలో ఇండియా కూడా ఒక్క దేశంగా ఉంది. పౌర సైనిక అవసరాల ద్వంద్వ ప్రయోజనాల సరుకులు, ముడిపదార్థాలు లేదా మిషన్ల చలామణి రవాణా సంబంధిత విషయాలలో ప్రపంచ దేశాల నడుమ సమాచార వినిమయానికి కట్టుబాట్లతో ఈ ఒప్పందం కుదిరింది. ఇప్పుడు ఇక్కడ అదుపులోకి తీసుకున్న ఈ భారీ స్థాయి నౌక ఈ ఒప్పందం పరిధిలోకి వస్తుంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News