కుత్బుల్లాపూర్: బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని కొకోకోలా కంపెనీ చౌరస్తా వద్ద గురువారం ఉదయం రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఓ యువతి మృతి అక్కడికక్కడే మృతి చెందగా.. మరొకరికి గాయాలయ్యాయి. క్షతగాత్రున్ని చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కథనం ప్రకారం…. బాచుపల్లి నుండి మియాపూర్ వైపు పోతయ్య అనే వ్యక్తి తన మరదలు ప్రమీలతో కైనెటిక్ హోండా వాహనంపై వెళ్తుండగా వేగంగా వచ్చిన ఓ ప్రైవేట్ బస్సు ఢీకొట్టింది. దీంతో ప్రమీల అక్కడిక్కకడే మృతిచెందింది. పోతయ్యకు గాయపడ్డాడు. మృతురాలు ప్రమీల(22) బంజారాహిల్స్ లోని ఒమేగా ఆసుపత్రిలో నర్స్ గా పని చేస్తుంది. స్థానికులు సమాచారంతో ఘటనాస్థలికి చేరుకుని, కేసు నమోదుచేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించామని బాచుపల్లి పోలీసులు తెలిపారు.
Nurse Dies in Road Accident at Quthbullapur