- Advertisement -
శ్రీనగర్: జమ్మూ కశ్మీర్ లో జరిగిన ఎన్ కౌంటర్ లో జవాన్ మృతిచెందాడు. ఆదివారం ఉదయం జమ్మూ కశ్మీర్ లోని దొడ జిల్లాలో భద్రత బలగాలు, ఉగ్రవాదులకు మధ్య ఎన్ కౌంటర్ జరిగింది. హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాద సంస్థకు చెందిన ఇద్దరు ఉగ్రవాదులు దోడా పట్టణానికి 26 కిలోమీటర్ల దూరంలో ఉన్న గుండనా ప్రాంతంలోని పోస్టా-పోట్రా గ్రామంలో దాగి ఉన్నట్లు సమాచారం అందడంతో భద్రతా దళాలు సంయుక్త ఆపరేషన్ చేపట్టాయి. దీంతో ఉగ్రవాదులు కాల్పులకు పాల్పడడంతో భద్రతా బలతాలు ఎదురుకాల్పులు జరిపారు. ఈ ఎన్ కౌంటర్ లో ఓ ఉగ్రవాది మృతిచెందగా.. తీవ్రంగా గాయపడిన జవాన్ కూడా మరణించినట్లు ఆర్మీ అధికారులు తెలిపారు.
One Army jawan martyred in encounter at Jammu Kashmir
- Advertisement -