Friday, April 26, 2024

ఇంటి ముందు పడుకున్న వారిపైకి దూసుకెళ్లిన కారు…

- Advertisement -
- Advertisement -

One dead in Car enter into house in Peddapally

పెద్దపల్లి: కారు అదుపు తప్పి ఇంట్లోకి దూసుకెళ్లడంతో ఒకరు మృతి చెందిన సంఘటన పెద్దపల్లి జిల్లా బెల్లంపల్లిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం….. సుభాష్ నగర్ బస్తీలో బరిగెల లింగయ్య -రాజవ్వ తన కుమారుడు మధు(20)తో కలిసి ఎండకాలం కావడంతో ఆరుబయట పడుకున్నారు. ఇంక్ లైన్ బస్తీకి చెందిన రాకేశ్ అనే యువకుడు శాంతిఖని బస్తీ నుంచి తన ఇంటికి కారులో వెళ్తున్నాడు. కారును నిర్లక్ష్యంగా డ్రైవ్ చేయడంతో అదుపు తప్పి కారు లింగయ్య ఇంటి ముందు వైపు దూసుకెళ్లింది. ఈ ఘటనలో మధు ఘటనా స్థలంలో దుర్మరణం చెందగా లింగయ్య-రాజవ్వ తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే రాకేశ్ కారు తీసుకొని ఘటనా స్థలం నుంచి పారిపోయాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ భాస్కర్ రావు తెలిపారు. తాగి కారును నడిపాడా? లేక నిద్రమత్రులోకి జారుకోవడంతో ప్రమాదం జరిగిందా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News