Wednesday, May 1, 2024

మద్యం మత్తులో కత్తులతో దాడి.. యువకుడు మృతి

- Advertisement -
- Advertisement -

One Killed after attack with knife in Prakasam

ప్రకాశం: జిల్లాలోని బల్లికురువ మండలంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఆదివారం ఉదయం మండలంలోని కూకట్ పల్లిలో ఇద్దరు యువకులు మద్యం మత్తులో కత్తులతో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన  ఓ యువకుడు మృతి చెందాడు. దీంతో దాడిచేసిన యువకుడు పోలీస్ స్టేషన్ లో లొంగిపోయాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు.మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతి చెందిన యువకుడిని పల్లెల రామకృష్ణారెడ్డి(25)గా గుర్తించారు. ఈ ఘటనపై నిందితుడిని విచారించనున్నట్లు పోలీసులు తెలిపారు.

One Killed after attack with knife in Prakasam

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News