Monday, April 29, 2024

రాజేంద్రనగర్ లో రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రాజేంద్రనగర్ 152 పిల్లర్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా దూసుకొచ్చిన ఓ మోటర్ సైకిల్ అదుపుతప్పి డివైడర్ ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో మోటర్ సైకిల్ పై ప్రయాణిస్తున్న ఒకరు మృతి చెందగా.. మరోకరికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు, అంబులెన్స్ సంఘటనాస్థలానికి చేరుకుని గాయపడని వ్యక్తిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

మెహదీపట్నం నుండి ఆరంఘర్ వైపు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఎక్స్‌ప్రెస్ వేపై టూ వీలర్స్ కు ఎంట్రీ లేకున్నప్పటికీ వ్లైఓవర్ మీదనుంచి వెళ్తుండగా వర్షానికి బైక్ స్కిడ్ కావడంతో ప్రమాదం జరిగింది. రోడ్డు ప్రమాదంతో ఫ్లైఓవర్ పై భారీ గా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News