Monday, April 29, 2024

ఆగివున్న లారీని ఢీకొట్టిన బైక్.. ఒకరు మృతి

- Advertisement -
- Advertisement -

One Killed in Road Accident in Visakhapatnam

విశాఖపట్టణం: జిల్లాలోని అగనంపూడి జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. సోమవారం ఉదయం రహదారిపై ఆగివున్న లారీని వేగంగా దూసుకొచ్చిన ఓ బైక్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. మరో ఇద్దరు తీవ్ర గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని స్థానికులు సహాయంతో క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

One Killed in Road Accident in Visakhapatnam

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News