Friday, May 17, 2024

ఖాళీ స్థలం వివాదం… ఒకరు హత్య

- Advertisement -
- Advertisement -

అమరావతి: ఓ ఖాళీ స్థలం వివాదంలో ఓ వ్యక్తిని హత్య చేసిన సంఘటన ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా అచ్చంపేట మండలం గ్రంధసిరిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. నాగేశ్వర రావు అనే వ్యక్తికి ఖాళీ స్థలం ఉంది. ఆ స్థలంలో జంపని నాగేశ్వరరావు అనుభవిస్తున్నారు. తన స్థలాన్ని ఖాళీ చేయాలని జంపనికి నాగేశ్వరరావు సూచించడంతో ఇద్దరు మధ్య గొడవ జరిగింది. గొడవ తారాస్థాయికి చేరుకోవడంతో నాగేశ్వరరావును హత్య చేసి గదిలో మృతదేహాన్ని పెట్టి పారిపోయాడు. గ్రామస్థుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు ప్రస్తుతం పరారీలో ఉన్నాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News