- Advertisement -
అమరావతి : ఆగి ఉన్న లారీని వ్యాన్ ఢీకొట్టిన సంఘటన ఎపిలోని గుంటూరు జిల్లా ఈపూరు మండలం కొండ్రముట్ట వద్ద బుధవారం ఉదయం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకరు ఘటన స్థలంలో దుర్మరణం చెందగా మరో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో ఇద్దరు పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. ఆర్మూర్ నుంచి ప్రకాశం జిల్లా పామూరుకు వ్యాన్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
- Advertisement -