- Advertisement -
ఇంగ్లీష్బజార్: బెంగాల్లో హంగ్ అసెంబ్లీ ఏర్పడితే ప్రభుత్వ ఏర్పాటుకు టిఎంసికి మద్దతు ఇస్తామని కాంగ్రెస్ ఎంపి అబూ హసెమ్ఖాన్చౌదరి తెలిపారు. ఆ రాష్ట్రం నుంచి నాలుగుసార్లు ఎంపీగా ఎన్నికైన చౌదరి మాటలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. తమ పార్టీ సిపిఐ(ఎం)తో కూటమి ఏర్పాటు చేసింది. సిపిఐ(ఎం) మరోవైపు మత నాయకుడైన అబ్బాస్సిద్ధిఖీకి చెందిన ఐఎస్ఎఫ్తో సీట్ల సర్దుబాటు చేసుకున్నదని చౌదరి తెలిపారు. మతం కార్డును తమ పార్టీ వాడుకోదని ఆయన అన్నారు. టిఎంసిని మత పార్టీగా భావించడంలేదన్నారు. కాంగ్రెస్, వామపక్షాల కూటమిని అపవిత్రమైనదిగా విమర్శిస్తున్న బిజెపికి చౌదరి మాటలు అవకాశమిచ్చాయి. తమ విమర్శలకు బలం చేకూరిందని బిజెపి నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. మరోవైపు కేరళలో ఇండియన్ యూనియన్ ముస్లింలీగ్(ఐయుఎంఎల్)తో కాంగ్రెస్ కూటమి కట్టడం గమనార్హం.
- Advertisement -