- Advertisement -
న్యూఢిల్లీ : గత ఆదివారం జమ్మూకశ్మీర్లోని కతువా జిల్లాలో కలకలం రేపిన పావురం కేసు ఒక కొలిక్కి వచ్చింది. అన్నివిధాల పావురాన్ని పరీక్షించిన అనంతరం దానిని ఎలాంటి రహస్య ఆపరేషన్లకి ఉపయోగించలేదని నిర్థారించుకున్న తరువాత పోలీసులు విడిచిపెట్టారు. పాకిస్తాన్ నుంచి వచ్చిన పావురం సరిహుద్దు దగ్గరలో ఉన్న గీతా దేవి చద్వాల్ అనే మహిళ ఇంటిపై వాలింది. అయితే ఆ పావురం కాలికి ఒక రింగ్ ఉండటం గీత గమనించింది. దీంతో అనుమానం వచ్చిన ఆమె దానిని బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్కు అప్పగించింది. వారు పావురం గురించి స్థానిక హిరా నగర్ పోలీసు స్టేషన్కు సమాచారం అందించారు. గతంలో ఇలాంటి పావురాల ద్వారానే పాకిస్తాన్ సమాచారం చేరవేసిన సందర్భాలు చాలా ఉండటంతో పోలీసులు పావురాన్ని అదుపులోకి తీసుకొని అన్ని విధాల తనిఖీ చేశారు.
- Advertisement -