Friday, April 26, 2024

రాజీవ్ రహదారిపై టోల్‌గేట్ ఫీజుల పెంపు

- Advertisement -
- Advertisement -

Raising tollgate fees on Rajiv road

 

నేడు అర్ధరాత్రి నుంచి అమల్లోకి
హైదరాబాద్ నుంచి సిద్దిపేట, కరీంనగర్, సిరిసిల్ల,
జగిత్యాల, పెద్దపల్లి, జనగామ వెళ్లే వాహనదారులకు భారం

మనతెలంగాణ/హైదరాబాద్ : వాహనదారులకు టోల్‌గేట్ యజమాన్యం షాక్ ఇచ్చింది. ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రయాణించే వాహనదారులకు ముఖ్యంగా రాజీవ్ రహదారిపై ఉన్న టోల్‌గేట్ ఫీజులు పెంచింది. పెంచిన ధరలను ఆదివారం అర్ధరాత్రి నుంచి అమలు చేయనున్నారు. హైదరాబాద్ నుంచి సిద్దిపేట, కరీంనగర్, సిరిసిల్ల, జగిత్యాల, పెద్దపల్లి, జనగామ తదితర జిల్లాలకు వెళ్లేవారిపై టోల్‌గేట్ భారం పడనుంది. పెరిగిన టోల్‌గేట్ ఫీజుల వివరాలు ఇలా ఉన్నాయి.

కారు సింగిల్ ట్రిప్‌కు: రూ. 58, ఒక రోజు పాసుకు రూ. 87, నెల పాసుకు రూ. 1,740లుగా నిర్ణయించారు.
ఎల్‌సీవీ/మినీ బస్సు : సింగిల్ ట్రిప్‌కు రూ. 117, ఒక రోజు పాసు రూ. 175, నెల పాసు రూ. 3,510.
బస్సు/ట్రక్కు : సింగిల్ ట్రిప్‌కు రూ. 233, ఒక రోజు పాసు రూ. 349, నెల పాసు రూ. 6,990.
ఎంఏవీ : సింగిల్ ట్రిప్‌కు రూ. 583, ఒక రోజు పాసు రూ. 874, నెల పాసు రూ. 17,490.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News