Monday, April 29, 2024

షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ అధినేత పల్లోంజి మిస్త్రీ ఇకలేరు!

- Advertisement -
- Advertisement -

May be an image of 1 person

ముంబై:  షాపూర్జీ పల్లోంజీ (ఎస్పీ) గ్రూప్ చైర్మన్, బిలియనీర్ పల్లోంజీ మిస్త్రీ మంగళవారం తెల్లవారుజామున ఇక్కడ మరణించినట్లు కంపెనీ అధికారులు తెలిపారు. 100 బిలియన్ డాలర్లకు పైగా సమ్మేళనంలో 18.37 శాతం హోల్డింగ్‌తో SP గ్రూప్ టాటా గ్రూప్‌లో అతిపెద్ద వాటాదారు మిస్త్రీ .”భారతదేశంలో జన్మించిన మిస్త్రీ దక్షిణ ముంబైలోని తన నివాసంలో 01.00 గంటలకు నిద్రలో మరణించారు” అని వారు తెలిపారు. ఆయన ఐరిష్ పౌరసత్వం కూడా  పొందారు.

ఆయనకు నివాళులు అర్పిస్తూ, బిలియనీర్ పల్లోంజీ మిస్త్రీ మృతి చెందడం తనను బాధించిందని ప్రధాని నరేంద్ర మోడీ ట్వీట్ చేశారు.”వాణిజ్యం,  పారిశ్రామిక రంగానికి ఆయన ఎనలేని సేవలు అందించారు” అని మోడీ పేర్కొన్నారు.

1929లో జన్మించిన మిస్త్రీ, రియల్ ఎస్టేట్, టెక్స్‌టైల్స్, షిప్పింగ్ , గృహోపకరణాలు వంటి ఇతర వ్యాపారాలలో విస్తరించారు.  5-బిలియన్ డాలర్లకు పైగా పెట్టుబడి ఉన్న SP గ్రూప్‌కు సారథ్యం వహించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News