Saturday, April 27, 2024

లైబ్రరరీ సైన్సులో పన్నీరు మమతకు గోల్డ్ మెడల్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ ః జోగిపేట పి.జి. కాలేజ్ విద్యార్థిని పన్నీరు మమతకు లైబ్రరరీ సైన్స్ మాస్టర్ డిగ్రీలో గోల్డ్ మెడల్ లభించింది. ఉస్మానియా యూనివర్సిటిలో 2020-2022 సంవత్సరంలో లైబ్రరీ సైన్స్‌లో పిజి విద్యను అభ్యసించిన మమత యూనివర్సిటిలో అందరి కంటే ఉత్తమ ప్రతిభను కనబరచి చేల్మడ రాం చంద్ర రెడ్డి మెమోరియల్ గోల్ట్ మెడల్ సాధించింది. పన్నీరు మమత గజ్వేల్ జగదేవ్ పూర్‌కు చెందిన రైతు దంపతులు పన్నిరు నర్సింహులు,సుజాతల కుమార్తె. ఆమె సైదాబాద్, పూసలబస్తీకి చెందిన మద్దిబోయిన సత్యనారాయణ, మద్దిబోయిన విమల దంపతుల కుమారుడు శ్రీకాంత్ ను వివాహం చేసుకుంది. మమత పెళ్ళి తరువాత కూడా తన విద్యాభ్యాసం కొనసాగించి గోల్ మెడల్ సాధించడం ఎంతో గర్వంగా ఉందని కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News