న్యూఢిల్లీ: మాజి కేంద్రమంత్రి, బిజెపి వర్కింగ్ ప్రెసిడెంట్ జెపి నడ్డాతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో నెలకొన్న పరిస్థితులను కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లేందుకు రెండు రోజులుగా దేశ రాజధాని ఢిల్లీ పర్యటనలో ఉన్న పవన్ ఈ రోజు ఉదయం జెపి నడ్డా నివాసంలో ఆయనను కలిసిన సందర్భంగా వినాయక ప్రతిమను బహుకరించారు. పవన్ వెంట జనసేన నాయకుడు నాదెండ్ల మనోహర్ కూడా ఉన్నారు.
మరోవైపు పవన్ కల్యాణ్ ఢిల్లీ పర్యటన ముగించుకొని నేరుగా కాకినాడకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఆదివారం కాకినాడలో జనసేన కార్యకర్తలపై వైసిపి ఎంఎల్ఎ ద్వారంపూడి అనుచరులు, వైసిపి కార్యకర్తలు రాళ్ల దాడిపై పవన్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఢిల్లీ నుంచి నేరుగా కాకినాడకే వస్తానని, ఈ విషయంలో తాడో పేడో అక్కడో తేల్చుకుంటానని ట్విట్టర్ లో పేర్కొన్నాడు.
Jana Sena Party Chief Pawan Kalyan meets BJP Working President Jagat Prakash Nadda at his residence in Delhi. BJP General Secretary BL Santhosh and MP Tejasvi Surya also present pic.twitter.com/DmytKRp0NT
— ANI (@ANI) January 13, 2020
Pawan Kalyan meet to BJP Working President JP Nadda