Monday, April 29, 2024

విఎస్‌పి ప్రైవేటీకరణపై పవన్ కళ్యాణ్ ట్వీట్

- Advertisement -
- Advertisement -

pawan kalyan

విజయవాడ: జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ విశాఖ ఉక్కు కర్మాగారాన్ని(విఎస్‌పి)ని ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ తన ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన 1966లో ఆంధ్రప్రదేశ్‌లో ఉక్కు కర్మాగారాన్ని నెలకొల్పాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టిన ఉద్యమకారులపై పోలీసులు విరుచుకుపడ్డ విషయాన్ని గురించి ట్వీట్ చేశారు. ఆ రోజుల్లో ‘విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు’ నినాదం రాష్ట్రవ్యాప్తంగా ప్రజలతో ముడిపడిపోయిందన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఉక్కు కర్మాగారం నెలకొల్పాలంటూ ఆందోళన ఎప్పుడైతే  తీవ్ర స్థాయికి చేరుకుందో ఆ సమయంలో పోలీసులు ఆందోళనకారులపై విరుచుకుపడ్డారని, దాంతో  32 మంది చనిపోయారని కూడా ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News