Thursday, May 16, 2024

ఎకరాకు రూ. 10 వేల పరిహారం చెల్లించాలి

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతులను వెంటనే ఆదుకోవాలని బిఆర్‌ఎస్ అగ్రనాయకులు, మాజీ మంత్రి హరీశ్‌రావు ఎక్స్ వేదికగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదిలాబాద్, నిజామాబాద్, కామారెడ్డి, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, మెదక్, సిద్దిపేట, రంగారెడ్డి తదితర జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వడగండ్ల వాన అన్నదాతను అతలాకుతలం చేసిందని, పంటలు చేతికి రానున్న సమయంలో కురిసిన వడగండ్ల వాన రైతులకు కన్నీ రు మిగిల్చిందని పేర్కొన్నారు.

వరి, మొక్కజొన్న, జొన్న పంటలతోపాటు బొప్పాయి, మామిడి సహా ఇతర ఉద్యాన పంటలు దెబ్బతినడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారని అన్నారు. గతం లో అకాల వర్షాల వల్ల రైతులు నష్టపోతే, అప్పటి సిఎం కెసిఆర్ స్వయంగా వెళ్లి రైతులను పరామర్శించి భరోసా కల్పించి, అక్కడికక్కడే ఎకరాకు రూ.10వేల నష్టపరిహారం ప్రకటించి అమలు చే శారని గుర్తు చేశారు. రెండు, మూడు రోజులుగా అకాల వర్షాలు కురుస్తున్నప్పటికీ, ప్రభు త్వం నుంచి కనీసం స్పందించడం లేదని అన్నా రు. రాజకీయాలు తప్ప, రైతు ప్రయోజనాలు పట్ట ని కాంగ్రెస్.. ఇప్పటికైనా మేల్కొని అన్నదాతకు అం డగా నిలవాలని కోరారు. జరిగిన పంట నష్టాన్ని తక్షణమే అంచనా వేయడంతో పాటు, ఎకరాకు రూ.10వేల నష్ట పరిహారం చెల్లించాలని హరీశ్‌రావు బిఆర్‌ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News