Friday, April 26, 2024

నిమజ్జనంపై సుప్రీంకోర్టులో పిటిషన్

- Advertisement -
- Advertisement -

Petition in Supreme Court on Ganesh Immersion

నేడు సిజెఐ విచారణకు వచ్చే అవకాశం

పిఒపి విగ్రహాల నిమజ్జనం నిషేధాన్ని సవాల్ చేసిన రాష్ట్రం

మన తెలంగాణ/హైదరాబాద్ : హుస్సేన్ సా గర్‌లో పివొపి విగ్రహాలను నిమజ్జనం చేయొద్ద ని హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ప్రభుత్వం మంగళ వారం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈక్ర మంలో బుధవారం ఉదయం సిజెఐ ధర్మాస నం ఎదుట ప్రభుత్వం మెన్షన్ చేయనుంది. హుస్సేన్‌సాగర్‌లో పివొపి విగ్రహాల నిమజ్జనం చేయొద్దని హైకోర్టు ఆంక్షలు విధించడంతో హైకోర్టు ఇచ్చిన తీర్పును తెలంగాణ ప్రభుత్వం సవాలు చేసింది. ఈ మేరకు జిహెచ్‌ఎంసి కమిషనర్ లోకేష్ కుమార్ సుప్రీంకోర్టులో పిటి షన్ దాఖలు చేశారు. రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులపై సోమవారం రాత్రి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, పురపాలకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ ప్రగతిభవన్‌లో సిఎం కెసిఆర్‌తో ప్రత్యేకంగా సమావేశమై చర్చించారు. హైకోర్టు ఉత్తర్వులను సాధ్యమైనంత త్వరగా సుప్రీంకోర్టులో సవాల్ చేయాలని సీఎం కెసిఆర్ వారిని ఆదేశించారు.

ఇదిలావుండగా హుస్సేన్ సాగర్‌లో గణేశ్, దుర్గాదేవి విగ్రహాలు నిమజ్జనం చేయవద్దని కోరుతూ న్యాయవాది మామిడి వేణుమాధవ్ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు, జస్టిస్ టి.వినోద్ కుమార్ ధర్మాసనం తీర్పు వెలువరించింది. హుస్సేన్ సాగర్‌లో ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలు నిమజ్జనం చేయవద్దని హైకోర్టు ఆదేశించింది. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలను వివిధ ప్రాంతాల్లో హెచ్‌ఎండిఎ ఏర్పాటు చేసిన 25 కుంటల్లో నిమజ్జనం చేయాలని స్పష్టం చేసింది. అభ్యంతరాలుంటే సుప్రీంలో సవాలు చేసుకోవచ్చుకృత్రిమ రంగులు లేని ఇతర విగ్రహాలను సాగర్‌లో నిమజ్జనం చేయడానికి ధర్మాసనం అనుమతిచ్చింది. అయితే ట్యాంక్ బండ్ వైపు విగ్రహాల నిమజ్జనం చేయవద్దని స్పష్టం చేసిన హైకోర్టు పివి మార్గ్, నెక్లెస్ రోడ్, సంజీవయ్య పార్క్ వైపు నుంచి చేసుకోవచ్చని తెలిపింది. సాగర్‌లో ప్రత్యేక రబ్బర్ డ్యామ్ ఏర్పాటు చేసిఅందులో నిమజ్జనం చేయాలని పేర్కొంది. వినాయక నిమజ్జనంపై తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును పునఃసమీక్షించాలని కోరుతూ ప్రభుత్వ చేసిన విజ్ఞప్తిని ఉన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. తమ ఉత్తర్వులపై అభ్యంతరాలుంటే సుప్రీం కోర్టులో సవాలు చేసుకోవచ్చని సూచించింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News