Thursday, May 16, 2024

హైదరాబాద్ కు చేరుకున్న ప్రధాని మోడీ..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హైదరాబాద్ కు చేరుకున్నారు. మహబూబ్ నగర్ జిల్లా పర్యటనలో నేపథ్యంలో కొద్దిసేపటి క్రితం శంషాబాద్ ఎయిర్ పోర్టకు చేరుకున్న ప్రధాని మోడీకి రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తోపాటు గవర్నర్ తమిళిసై, కేంద్ర మంత్రి, రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు జి కిషన్ రెడ్డి, పలువురు బిజెపి నాయకులు ఘన స్వాగతం పలికారు. మరికొద్దిసేపట్లో ప్రత్యేక విమానంలో ప్రధాని మోడీ మహబూబ్ నగర్ కు బయల్దేరి వెళ్లనున్నారు.

కాగా, మహబూబ్‌నగర్ జిల్లా పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రధాని మోడీ శంకుస్థాపన చేసి జాతికి అంకితం చేయనున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రధాని మోడీ ప్రసంగించనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News