Monday, May 6, 2024

గంగానదిలో ప్రధాని మోడీ పవిత్ర స్నానం..

- Advertisement -
- Advertisement -

లక్నో: వారణాసిలో పర్యటిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సోమవారం ఉదయం కాలభైరవ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తర్వాత జల మార్గం గుండా లలిత ఘాట్‌కు చేరుకుని గంగానదిలో ప్రధాని మోడీ పవిత్ర స్నానం చేశారు.  కాగా, ఈ పర్యటనలో ప్రధాని కాశీ విశ్వనాథ్ కారిడార్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించనున్నారు. గంగానదిపై ఉన్న రెండు ఘాట్ లతో ఆలయాన్ని కలుపుతూ కారిడార్ ను నిర్మించారు. ఐదువేల హెక్టార్ల స్థలంలో కారిడార్‌ ప్రాజెక్టును రూ.339 కోట్ల వ్యయంతో నిర్మించారు. 2019 మార్చి 8న కారిడార్ ప్రాజెక్టుకు ప్రధాని మోడీ శంకుస్థాపన చేశారు.

PM Modi holy dip in River Ganga in Varanasi

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News