Sunday, April 28, 2024

రైతు వ్యతిరేక బిజెపి ప్రభుత్వం వద్దు: పల్లా

- Advertisement -
- Advertisement -

No to anti-farmer BJP government

హైదరాబాద్: రైతు వ్యతిరేక బిజెపి ప్రభుత్వం తమకు వద్దని ఎంఎల్ సి పల్లా రాజేశ్వర్ రెడ్డి తెలిపారు. కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం పై పల్లా రాజేశ్వర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వాన్ని కూల్చే వరకు టిఆర్ఎస్ పోరాటం కొనసాగిస్తుందన్నారు. రైతు వ్యతిరేక ప్రభుత్వం తమకు అవసరం లేదని,  రైతుల పండించే వరి కోనే ప్రభుత్వాలకే తమ మద్దతు ఉంటందన్నారు. బిజెపి ప్రభుత్వం కూల్చే అన్ని శక్తులతో సిఎం కెసిఆర్ కలుస్తారని స్పష్టం చేశారు. బిజెపి ప్రభుత్వాన్ని కూల్చేందుకు ప్రయత్నించేవారికి తమ మద్దతు ఉంటుందని తెలియజేశారు. కేంద్రంలో బిజెపి ప్రభుత్వాన్ని గద్దె దించే శక్తులతో సిఎం కెసిఆర్ చర్చలు జరుపుతారని వివరించారు. అవసరం అనుకున్న సమయంలో అవసరమైన సందర్భంలో కెసిఆర్ కీలక నిర్ణయం తీసుకుంటారని పల్లా పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News