Thursday, May 9, 2024

హైదరాబాద్ లో మోడీ రోడ్ షో… రెండో రోజు పర్యటన వివరాలు

- Advertisement -
- Advertisement -

తెలంగాణలో నవంబర్ 30న ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. ఈ ఎన్నికల్లో వీలైనన్నీ సీట్లు గెలిచి సత్తా చాటాలని బీజేపీ అదిష్ఠానం భావిస్తోంది. ఈక్రమంలో నిన్న(ఆదివారం) తెలంగాణకు వచ్చిన ప్రధాని మోడీ.. పలు జిల్లాల్లో పర్యటించారు. సోమవారం కూడా తెలంగాణలో మోడీ పర్యటన కొనసాగనుంది.  ఈరోజు ఉదయం 11 గంటలకు మహబూబాబాద్ లో, మధ్యాహ్నం 12 గంటలకు కరీంనగర్‌ జరుగనున్న విజయ సంకల్ప సభలో పాల్గొననున్నారు. ఇక, సాయంత్రం 4 గంటలకు హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్‌ రోడ్‌ నుంచి కాచిగూడ వరకు మోడీ రోడ్‌ షోలో నిర్వహించనున్నారు. అనంతరం సాయంత్రం 6 గంటలకు ఎన్టీఆర్‌ స్టేడియంలో భక్తి టీవీ కోటిదీపోత్సవంలో ప్రధాని మోడీ పాల్గొననున్నారు.

కాగా, ఈరోజు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ప్రధాని నరేంద్ర మోడీ దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనం కోసం సోమవారం ఉదయం ఆలయానికి చేరుకున్న ప్రధాని మోడీకి టిటిడి ఛైర్మన్, ఈవో, ఆలయ అర్చకులు ఆలయ మహాద్వారం వద్ద ఇస్తికఫాల్ స్వాగతం పలికారు. అనంతరం స్వామివారిని దర్శించుకున్న మోడీకి రంగనాయకుల మండపంలో అర్చకులు వేదాశీర్వచనం చేశారు. ఈ సందర్భంగా ప్రధానికి శ్రీవారి పట్టువస్త్రాలతో టిటిడి ఛైర్మన్, ఈవో సత్కరించారు. తర్వాత స్వామివారి చిత్రపటాన్ని ప్రధానికి బహూకరించి తీర్థప్రసాదాలు అందజేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News