Friday, May 3, 2024

పశ్చిమాసియాలో పరిస్థితులపై మోడీ ఆరా: ఈజిప్టు అధ్యక్షుడితో చర్చలు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో రోజురోజుకీ దిగజారుతున్న పరిస్థితులు, మానవతా సంక్షోభంపై ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫతాహ్ ఎల్‌సిసితో ఫోన్‌లో చర్చించినట్టు ప్రధాని నరేంద్రమోడీ తెలిపారు. ఈ ప్రాంతంలో పెరుగుతున్న ఉగ్రవాదం, హింస, సామాన్య పౌరుల మరణాలపై ఇరువురు నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం కొనసాగుతున్న ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం నేపథ్యం లోనే వారు ఈమేరకు శుక్రవారం చర్చలు జరిపారు.

పశ్చిమాసియాలో వెంటనే శాంతియుత వాతావరణాన్ని పునరుద్ధరించి స్థిరత్వాన్ని సాధించాల్సిన అవసరం ఉందని వీరు పిలుపునిచ్చారు. తాజా ఉద్రిక్తతల వల్ల ప్రభావితమైన బాధితులకు మానవతా సాయం అందించాల్సిన అవసరం ఉందన్నారు. గాజాలో ఇజ్రాయెల్ సైనిక కార్యకలాపాలపైనా ఇరువురు నేతలు చర్చించినట్టు ఈజిప్టు అధ్యక్ష కార్యాలయ అధికార ప్రతినిధి తెలిపారు. పరిస్థితులు మరింత దిగజారితే వచ్చే ముప్పుపైనా చర్చ జరిగినట్టు పేర్కొన్నారు. సామాన్య పౌరుల జీవితాలు, ప్రాంతీయ భద్రతపై ఎలాంటి ప్రతికూల ప్రభావం ఉండనుందో చర్చించినట్టు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News