Saturday, April 27, 2024

స్వాతంత్య్ర యోధులకు డిజిటల్ నివాళులకు ప్రధాని పిలుపు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: స్వాతంత్య్ర సమరయోధులకు వినూత్న రీతిలో డిజిటల్ నివాళులు అర్పించాలని దేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోడీ శనివారం పిలుపునిచ్చారు. భారత స్వాతంత్య్ర సంగ్రామం పాల్గొన్న వీరులకు నివాళుర్పించేందుకు దేశ రాజధానిలోని సెంట్రల్ పార్కులో ఏర్పాటు చేసిన డిజిటల్ జ్యోతి ప్రజలు ఆన్‌లైన్ ద్వారా పంపే నివాళులతో ఉద్దీపనం చెందుతుందని ప్రధాని తెలిపారు. ప్రజలందరూ ఆన్‌లైన్ ద్వారా నివాళులర్పించి సెంట్రల్ పార్కులో ఏర్పాటు చేసిన డిజిటల్ జ్యోతిని దేదీప్యమానంగా ప్రకాశింపచేయాలని ప్రధాని కోరారు. ఆజాది కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా ఏర్పాటు చేసిన ఈ డిజిటల్ జ్యోతికి సంబంధించిన లిజిటల్ లింక్-digitaltribute.in ను ప్రధాని షేర్ చేశారు.

PM Modi urges to pay digital tribute to freedom fighters

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News