- Advertisement -
న్యూఢిల్లీ: భారత్లో ఖతార్ నుంచి పెట్టుబడులను ప్రోత్సహించేందుకు ప్రత్యేక టాస్క్ఫోర్స్ను ఏర్పాటు చేయనున్నట్టు ప్రధాని కార్యాలయం(పిఎంఒ) ఓ ప్రకటనలో తెలిపింది. త్వరలో జరగనున్న ఖతార్ జాతీయ దినోత్సవం సందర్భంగా ఆ దేశ అధ్యక్షుడు అమీర్షేఖ్ తమీమ్బిన్ హమీద్కు ప్రధాని మోడీ శుభాకాంక్షలు తెలిపారు. ఇరువురు నేతలు మంగళవారం ఫోన్లో మాట్లాడుకున్నారని పిఎంఒ తెలిపింది. భారత్లోకి విదేశీ పెట్టుబడులు, ఇంధన భద్రతకు ఖతార్ కీలక భూమిక నిర్వహిస్తోందని ప్రధాని మోడీ ట్విట్ చేశారు. కరోనాబారి నుంచి ప్రపంచం విముక్తి పొందిన తర్వాత ఇరువురు నేతలు కూలంకుశంగా చర్చించుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ సందర్భంగా ప్రధానికి షేఖ్ తమీమ్ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.
PM Narendra Modi speaks to Qatar Emir
- Advertisement -