Sunday, May 12, 2024

ఇన్వెస్ట్ ఇండియాకు ఐరాస అవార్డు

- Advertisement -
- Advertisement -

United Nations Award for Invest India

 

అభినందించిన ప్రధాని మోడీ

న్యూఢిల్లీ: ‘2020 ఐక్యరాజ్యసమితి పెట్టుబడుల ప్రోత్సాహక అవార్డు’ను ఇన్వెస్ట్ ఇండియా గెలుచుకోవడం పట్ల ప్రధాని మోడీ అభినందించారు. ఇన్వెస్ట్ ఇండియా అనేది కేంద్ర ప్రభుత్వ పెట్టుబడుల ప్రోత్సాహక ఏజెన్సీ. ప్రపంచ పెట్టుబడులకు భారత్ కేంద్రస్థానమనేందుకు ఈ అవార్డు ఓ నిదర్శనమని ప్రధాని ట్విట్ చేశారు. సులభతర వాణిజ్యాన్ని పెంపొందించేందుకు ఇది దోహదపడుతుందని ప్రధాని తెలిపారు. 2020 పెట్టుబడుల ప్రోత్సాహక అవార్డుకు ఇన్వెస్ట్ ఇండియాను వాణిజ్యం, అభివృద్ధిపై ఐరాస సమాఖ్య(అంక్టాడ్) విజేతగా ప్రకటించింది. జెనీవాలోని అంక్టాడ్ ప్రధాన కార్యాలయంలో అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. 180 దేశాల పెట్టుబడుల ప్రోత్సాహక ఏజెన్సీలపై మదింపు జరిపిన అంక్టాడ్ ఈ అవార్డుకు ఇన్వెస్ట్ ఇండియాను ఎంపిక చేసింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News