- Advertisement -
హైదరాబాద్: ముషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దాయరా మార్కెట్ లోని “డ్రీం వరల్డ్ వెడియో గేమ్” సెంటర్ పై సెంట్రల్ జోన్ టాస్క్ ఫోర్స్ దాడి చేశారు. కోవిడ్-19 నిబంధనలకు విరుద్ధంగా ఈ వీడియో గేమ్ సెంటర్ నడుపుతున్న యజమాని సయ్యద్ మొయినుద్దీన్ (38)తో పాటు 18 మంది ఆటగాళ్ళును పోలీసులు అదుపులో తీసుకున్నారు. రూ. 9555 నగదుతో పాటు 05 టివిలు, ప్లేయింగ్ స్టేషన్లు -03, జాయ్ స్టిక్స్ / కంట్రోలర్ -03, మెమరీ కార్డులు -06, సెల్ ఫోన్లు -13, భారత్పే క్యూఆర్ కోడ్ స్కానర్ -01 వారి వద్ద నుంచి స్వాధీనం చేసుకున్నారు. తదుపరి విచారణ నిమితం ముషీరాబాద్ పోలీసులకు అప్పగించినట్టు అధికారులు తెలిపారు.
- Advertisement -