Monday, April 29, 2024

బేగంపేట పేకాట శిబిరంపై పోలీసుల దాడి

- Advertisement -
- Advertisement -
Police arrested five poker players in Begumpet
ఐదుగురు పేకాట రాళ్ల అరెస్టు

హైదరాబాద్: పేకాట శిబిరంపై దాడి చేసి పేకాడుతున్న ఐదుగురు వ్యక్తులతోపాటు నిర్వాహకుడిని నగర టాస్క్‌ఫోర్స్ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం…నగరానికి చెందిన అరవింద్ అగర్వాల్ నగరంలోని పలువురు ప్రముఖలతో పేకాట శిబిరం నిర్వహిస్తున్నాడు. వ్యాపారులు, రాజకీయనాయకులను పేకాడేందుకు ఆహ్వానిస్తున్నాడు. బేగంపేటలోని పేకాట శిబిరం నిర్వహిస్తున్నాడు. ఇందులో పలువురు వాట్సాప్‌లో ఇచ్చిన మేసేజ్ వల్ల వచ్చి పేకాడుతున్నారు. ఇలా చాలామంది రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు దాడి చేసి అక్కడ పేకాడుతున్న ఐదుగురు జాఫర్ హుస్సేన్, సిద్దార్థ్ అగర్వాల్, బగీరియా సూర్యకాంత్, అబ్దుల్ అలీజిలానీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.12లక్షలు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు బేగంపేట పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News