- Advertisement -
మనతెలంగాణ/హైదరాబాద్: ఎపి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యక్తిగత కార్యదర్శి మనోహర్పై చిత్తూరు జిల్లా కుప్పం పోలీసులు కేసు నమోదు చేశారు. కుప్పం కోపరేటివ్ టౌన్ బ్యాంకులోని శ్రీ ప్రసన్న తిరుపతి గంగమ్మ ఆలయం ఫిక్సిడ్ డిపాజిట్లకు సంబంధించి సంతకాను ఫోర్జరీ చేసి ఫిక్సిడ్ డిపాజిట్లపై రుణం తీసుకున్నారంటూ వైసిపి నేత విద్యాసాగర్ ఫిర్యాదు మేరకు మనోహర్పై ఐపిసి 420, 468, 471 సెక్షన్ల కింద కేసు నమోదైంది. పోలీసుల విచారణలో సుమారు రూ. 2కోట్ల 97 లక్షల అవినీతి జరిగినట్టు నిర్ధారణ అయింది. కాగా చిత్తూరు జిల్లా కుప్పం టౌన్ బ్యాంక్లో గోల్మాల్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కలకలం రేపుతోంది.
Police Case filed against Chandrababu’s PA in Chittoor
- Advertisement -