పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, పూజాహెగ్డేలు హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న విషయం తెలిసిందే. ఇంకా పేరు ఖరారు చేయని ఈ చిత్రానికి ఓ డియర్, – రాధే శ్యామ్ అనే టైటిల్స్ వినిపిస్తున్నాయి. ఈ చిత్రాన్ని యువి క్రియేషన్స్, గోపీ కృష్ణ మూవీస్ బ్యానర్లు భారీ బడ్జెట్తో నిర్మిస్తుండగా ‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. ఇది ఒక పీరియాడిక్ లవ్ ఎంటర్టైనర్ అని సమాచారం. ఈ సినిమాకు సంబంధించిన కీలక సన్నివేశాలను జార్జియాలో మార్కెట్ సెట్ వేసి చిత్రీకరించి కరోనా నేపథ్యంలో ఇండియాకి తిరిగి వచ్చారు ఫిల్మ్మేకర్స్.
‘బాహుబలి’ తరువాత పాన్ ఇండియా స్టార్గా గుర్తింపు పొందిన ప్రభాస్ వరుసగా భారీ చిత్రాలు చేస్తున్నారు. గత ఏడాది ఆయన అతిపెద్ద యాక్షన్ ఎంటరైనర్ ‘సాహో’తో ప్రేక్షకులను పలకరించారు. ఇదిలా ఉండగా సున్నితమైన ప్రేమకథలా తెరక్కుతున్న ఈ మూవీలో భావోద్వేగాలు కూడా తారాస్థాయిలో ఉంటాయట. లవర్స్గా కనిపించే ప్రభాస్, – పూజాహెగ్డేల మధ్య కెమిస్ట్రీ ఈ సినిమాలో ప్రధాన ఆకర్షణగా ఉండబోతోందట. ఈ సినిమాలో అందాల తార పూజాహెగ్డే తన అందచందాలు, గ్లామర్తో ప్రేక్షకులను మైమరపించనుంది. ఆమె గ్లామర్ సినిమాలో ఓ హైలైట్గా నిలవనుంది.