ఇప్పుడు మన ఇండియాలోనే టాక్ ఆఫ్ ది స్టార్ హీరోగా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నిలుస్తున్నాడు. వరుసబెట్టి భారీ ప్రాజెక్టులను లైన్లో పెడుతూ తన పాన్ ఇండియన్ స్టార్డమ్ను పెంచుకుంటూ వస్తున్నాడు. అయితే ప్రభాస్ లైన్లో పెట్టినటువంటి వరుస మూడు ప్రాజెక్టులు ఒకదానిని మించేలా మరొకటి ఉన్నాయి. వీటిలో రాధే శ్యామ్, ఆదిపురుష్ చిత్రాలకు సంబంధించి ఫిల్మ్మేకర్స్ తరచుగా సమాచారాన్ని అందిస్తున్నారు. అయినప్పటికీ ప్రభాస్, నాగ్అశ్విన్ల ప్రాజెక్ట్ అంటేనే అభిమానులు ఎక్కువగా ఆసక్తి కనబరుస్తున్నారు. ఇదిలా ఉండగా వచ్చే 2021లో ‘రాధే శ్యామ్’ విడుదల పక్కాగా ఉండనుండగా… 2022లో మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ నాగ్అశ్విన్ తో తీస్తున్న స్కై ఫై థ్రిల్లర్, అలాగే ఓం రౌత్తో తీస్తున్న పీరియాడిక్ డ్రామాను విడుదల చేసేయాలని ఆలోచనలో ఉన్నారట. ఈ లెక్కన ప్రభాస్ నుంచి ఒకపక్క సాలిడ్ ట్రీట్తో పాటుగా బాక్సాఫీస్ బొనాంజా కూడా 2022లో డబుల్ రేంజ్ లో ఉంటుందని చెప్పాలి.
Prabhas and Nag Ashwin movie will release in 2022?