న్యూఢిల్లీ: ఆప్కు ఎన్నికల వ్యూహకర్తగా పనిచేసిన ప్రశాంత్ కిశోర్ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ను కలిసి అభినందనలు తెలిపారు. అనంతరం ట్విట్టర్ వేదికగా బిజెపిపై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. ‘భారత ఆత్మను ఢిల్లీ ఓటర్లు గెలిపించారు’ అని పరోక్షంగా బిజెపిని ఉద్దేశిస్తూ ట్వీట్ చేశారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సిఎఎ, ఎన్పిఆర్లను వ్యతిరేకిస్తూ బిజెపిపై విమర్శలు గుప్పించిన ప్రశాంత్ కిశోర్ను జెడియు ఉపాధ్యక్ష పదవి నుంచి ఆ పార్టీ అధినేత, బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ తొలగించిన సంగతి తెలిసిందే. పశ్చిమ్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా కేజ్రీవాల్కు అభినందనలు తెలిపింది. బిజెపిని ప్రజలు తిప్పికొట్టారని, అభివృద్ధి మాత్రమే ఈ ఎన్నికల్లో పనిచేసిందన్నారు. సిఎఎ, ఎన్ఆర్పి, ఎన్పిఆర్ను ఓటర్లు తోసిపుచ్చారని మమత పేర్కొన్నారు.
Prashant Kishor wishes to Kejriwal for Election Victory