Saturday, May 4, 2024

రైతుల ఉద్యమం వెనుక రాజకీయం లేదు: ప్రియాంక గాంధీ

- Advertisement -
- Advertisement -

Priyanka Gandhi visits Uttar Pradesh Rampur

లక్నో: ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని రాంపూర్ లో కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకురాలు ప్రియాంక గాంధీ పర్యటించారు. జనవరి 26న ట్రాక్టర్ల ర్యాలీలో చనిపోయిన రైతు కుటుంబాన్ని ప్రియాంక పరామర్శించారు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న రైతులపై కేసులు నమోదు చేయడం సరికాదని ఆమె పేర్కొన్నారు. రైతుల ఉద్యమం వెనుక రాజకీయం లేదని ఆమె స్పష్టం చేశారు. రైతుల నిజమైన పోరాటాన్ని, బాధను కేంద్ర ప్రభుత్వం గుర్తించాలని ప్రియాంక డిమాండ్ చేశారు. ఈ పర్యటనలో ప్రియాంక గాంధీకి పెనుప్రమాదం తప్పింది. ఆమె కాన్వాయ్ లోని నాలుగు వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

Priyanka Gandhi visits Uttar Pradesh Rampur

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News