Tuesday, May 7, 2024

ఆ నిర్మాతలు డబుల్ గేమ్ ఆడారు: నట్టికుమార్

- Advertisement -
- Advertisement -

Producer NattiKumar respond on Pawan and Posani Issue

హైదరాబాద్: ఆ ఆరుగురు నిర్మాతలు డబుల్ గేమ్ ఆడటమే పవన్ కల్యాణ్, పోసాని మధ్య వివాదానికి కారణభూతమైందన్న అభిప్రాయాన్ని నిర్మాత, దర్శకుడు నట్టికుమార్ వ్యక్తంచేశారు. శుక్రవారం హైదరాబాద్‌లోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నట్టికుమార్ మాట్లాడుతూ “పవన్ కల్యాణ్‌తో సినిమాలను తీస్తున్న కొందరు నిర్మాతలు ఇచ్చిన ఫీడ్ బ్యాక్ వల్లే ‘రిపబ్లిక్’ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో ఆయన ఆలా మాట్లాడారు. ఏపీ మంత్రి పేర్ని నానిని కలసి వచ్చిన నిర్మాతలు కొందరు అక్కడ మాట్లాడిన విషయాలను స్పష్టంగా చిత్ర పరిశ్రమకు తెలియజేయకపోవడం కూడా అనేక అపోహలకు దారితీసింది. అక్కడ ఏం మాట్లాడి వచ్చారన్న విషయాన్ని ఆ పెద్ద మనుషులు బయటకు వెల్లడించకపోగా, పవన్‌ను రెచ్చగొట్టేలా డబుల్ గేమ్ ఆడారు. దాంతో పవన్ మాట్లాడిన మాటలు వివాదమయ్యాయి. హైదరాబాద్‌లోని పోసాని కృష్ణమురళి ఇంటిపై పవన్ కళ్యాణ్ ఫాన్స్ దాడి చేయడాన్ని ఖండిస్తున్నాను. ఇలాంటి వివాదాలకు పుల్‌స్టాఫ్ పడేవిధంగా చిరంజీవి, మోహన్ బాబు, జీవిత రాజశేఖర్, విష్ణు తదితరులు తగిన చర్యలు తీసుకోవాలి. ఈ దాడులను వారంతా ఖండించాలి” అని అన్నారు.

Producer NattiKumar respond on Pawan and Posani Issue

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News