Wednesday, May 8, 2024

భూకబ్జా రాకెట్‌ను ఛేదించిన పూణె పోలీసులు

- Advertisement -
- Advertisement -

 

land grabbing racket

పూణే: మిలిటరీ ఇంటెలిజెన్స్  అందించిన సమాచారం మేరకు పూణే నగర పోలీసులు..  నకిలీ గుర్తింపు పత్రాలను ఉపయోగించి భూకబ్జాకు పాల్పడిన  రాకెట్‌ను ఛేదించారు. గత రెండు వారాలుగా పూణె సిటీ పోలీసుల క్రైమ్ బ్రాంచ్ ఏడుగురిని అరెస్టు చేసింది. మహారాష్ట్రలోని పలు ప్రాంతాల్లో దాడులు నిర్వహించింది, ఆధార్ కార్డులు, పాన్ కార్డులు, ఓటర్ ఐడి మరియు బ్యాంకు పత్రాలు మరియు వీటిని తయారు చేయడానికి ఉపయోగించే పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. అరెస్టయిన నిందితుల్లో బుల్దానాలోని ఖమ్‌గావ్‌కు చెందిన  ప్రధాన సూత్రధారి కల్పేష్ బోహ్రా , ఇంకా  పూణే, థానే మరియు బుల్దానాకు చెందిన ఐదుగురు ప్రాపర్టీ ఏజెంట్లు ఉన్నారు.

క్రైమ్ బ్రాంచ్ దర్యాప్తులో నిందితులు ఆన్‌లైన్ మ్యాపింగ్ సాధనాలను ఉపయోగించి,  ఇతర ప్రాపర్టీ ఏజెంట్ల నుండి అందిన సమాచారం ఆధారంగా నిర్లక్ష్యం చేయబడిన భూమి వివరాలను గుర్తించారని తెలిసింది. భూమిని యజమాని నిర్లక్ష్యం చేడనిగని లేదా యజమాని జాడ తెలియరాలేదని ధృవీకరించిన తర్వాత, నిందితులు నకిలీ పత్రాలు తయారు చేసి భూమిని విక్రయించేవారు. అనుమానితులకు సంబంధించిన పలు భూ లావాదేవీలపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఈ డీల్స్‌లో, పూణేలోని ముల్షి ప్రాంతంలోని భూమికి సంబంధించి కూడా అలాంటి లావాదేవీ ఒకటి జరిగింది. ముంబైకి సమీపంలోని అంబర్‌నాథ్ ,  పన్వెల్‌లోని ఇతర భూ ఒప్పందాలపై కూడా విచారణ జరుగుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News