స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కలయికలో సినిమా వస్తోందంటే ఫ్యాన్స్లో అంచనాలు రెట్టింపు అవుతాయి. ఈ నేపథ్యంలో రానున్న ‘పుష్ప’ సినిమాపై ఫిల్మ్మేకర్స్ మాత్రం పూర్తి నమ్మకంతో ఉన్నారు. అందుకే ఈ సినిమాకి దాదాపు వంద కోట్ల వరకు బడ్జెట్ కేటాయించారట. కరోనా తరువాత కూడా బడ్జెట్లో మార్పు లేకుండా ఖర్చు పెట్టబోతున్నట్లు తెలిసింది. ఇక నవంబర్ నుండి ఈ చిత్రం షూటింగ్ ప్రారంభించేసి సాధ్యమైనంత తక్కువమందితో షూటింగ్ పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఫస్ట్ షెడ్యూల్ లో బన్నీ, రష్మికపై సాంగ్ షూట్ చేయనున్నారని ఆ మధ్య వార్తలు వచ్చాయి. అయితే సాంగ్కి ఎక్కువ మంది డాన్సర్స్ కావాల్సి రావడం, ఎక్కువ రోజులు షూట్ చేయాల్సి రావడంతో ముందుగా సాంగ్ కంటే కూడా తక్కువమంది ఆర్టిస్ట్లు ఉన్న సీన్స్నే షూట్ చేయాలనుకుంటున్నారు. దేవీశ్రీ ప్రసాద్ ఈ సినిమాకి మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. ఇప్పటికే నాలుగు ట్యూన్స్ కూడా ఇచ్చాడట. మైత్రి మూవీ మేకర్స్ ఈ మూవీని నిర్మిస్తోంది.
Pushpa movie reguler Shooting from November